స్వాతికుమారి కవిత్వం - కోనేటి మెట్లు

ఈ మంత్రలోకపు అలౌకిక సౌందర్యాన్ని తన ఆలోచనాలోచనాలతో దర్శించి, కవిత్వంగా మన ముందుకు తీసుకు వచ్చిన నేటి తరం కవయిత్రి - స్వాతి. తన మానసిక పరిస్థితికి అనుగుణంగా ప్రకృతికి పదాల హారతి పడుతూ ఆ వెలుగుల్లో మనకీ ఓ కొత్త అందాన్నిపరిచయం చేయగల సమర్ధురాలీమె. కవిత్వమెందుకూ వ్రాయడమంటే... "మనదైన ఒక స్వాప్నిక జగత్తు మనకోసం ఎప్పుడూ ఎదురు చూస్తుందనే ధీమాతో వాస్తవ జీవితం తాలూకూ కరకుదనాన్ని, నిర్లిప్తతని ధిక్కరించగలిగే ధైర్యాన్నిస్తుంది కవిత్వం. కవిత్వమంటే అనుభూతుల పెదవులపై నర్మగర్భం గా వెలిసే ఒక చిలిపి నవ్వు, నవ్వులనదులన్నీ ఆవిరైపోయాక చివరికి మిగిలే ఓ కన్నీటి బొట్టు. అన్నీ ఆశలూ అడుగంటాక కూడా బ్రతకడంలో కనిపించే చివరి అర్ధం”   అని బదులిస్తూ , "కోనేటి మెట్లు" అన్న శీర్షికను ఎంచుకోవడంలోనే తన అభిరుచిని మచ్చుగా చూపెడతారు.

సంపుటిలోని ఒక్కో కవితా ఒక్కో కోనేటి మెట్టులా..లోతుగా ఉంటూనే, ఆఖరకు కోనేటి నీరంత స్వచ్ఛమైన ప్రశాంతమైన ప్రదేశానికి మనను తోడ్కొని పోతాయి. ఈ సంపుటికి ముందుమాట వ్రాస్తూ, మిత్రులు మూలా సుబ్రహ్మణ్యం గారు అననే అంటారు - "కోనేటి మెట్లు తీసుకెళ్ళే లోతుల్లోనే కోనేరు ఉంటుంది -  ఎంతటి గోపురమైనా, చివరికి ఆకాశమైనా అందులో ప్రతిఫలించాల్సిందే! కవిత్వానికి ఇంతకు మించిన ప్రతీక ఏముంటుంది" అని.

ప్రశ్నా చిహ్నాలు కనపడని ఆలోచనలు, సందేహాలంటూ మన ముందుంచే లోతైన ప్రశ్నలు ఈ సంపుటిలో కోకొల్లలు. ఎన్ని వేల ఆలోచనల ప్రతిఫలమో ఈ ఒక్క కవితా అనిపించే సందర్భాలూ ఉన్నాయి.

"నీటి మడుగు చుట్టూ రెల్లు గడ్డి పహారా
సుడులు రేపుతూ కలల గులకరాళ్ళు"


అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....